Skip to main content

మచిలీపట్నం కార్పొరేషన్ లో ఎలక్ట్రిషన్లకు కాలనీ ఏర్పాటు చేయాలి.

మచిలీపట్నం:

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నంలోని ఎలక్ట్రిషియన్స్ కోసం కాలనీ ఏర్పాటు చేసి అర్హులకు ఇళ్లస్థలా ఇవ్వాలని మచిలీపట్నం ఎలక్ట్రీషియన్స్ సర్వస్యత సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం మచిలీపట్నంలో రామానాయుడు పేట లోని రెస్టారెంట్ లో జరిగిన నగర ఎలక్ట్రిషియన్ల సర్వసభ్య సమావేశం లో ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణను స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ను పార్లమెంట్ సభ్యులు బాల సౌరిని జనసేన ఇన్చార్జి బండి రామకృష్ణను కోరుతూ తీర్మానం చేశారు. 

నగర ఎలక్ట్రిషియన్ ల సంఘ లీగల్ అడ్వైజర్ గా సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 ఈ సందర్భంగా మహాలక్ష్మి ఎలక్ట్రికల్స్ అధినేత మామిడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎలక్ట్రిషన్ల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. అర్హులైన నిరుపేద ఎలక్ట్రిషన్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను మామిడి కృష్ణ కోరారు. ప్రభుత్వ రంగ ఎలక్ట్రిషన్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు ఉచితంగా ఏర్పాటు చేయాలని కోరారు.

 సంఘ న్యాయ సలహాదారుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా యువ ఎలక్ట్రిషన్లు కంప్యూటర్ తో అనుసంధానమైన ఎలక్ట్రికల్ వైరింగ్ ను నేర్చుకోవాలని అన్నారు. వినియోగదారుల యొక్క నమ్మకాన్ని పెంచుకుంటూ వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల జాబితాలో ఎలక్ట్రిషన్ కూడా చేర్చి కార్మిక శాఖ ఇస్తున్న అన్ని సదుపాయాలు వర్తింపజేయాలని బాలాజీ కోరారు. త్వరలో మచిలీపట్నం ఎలక్ట్రీషియన్ల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని బాలాజీ అన్నారు.

 సీనియర్ ఎలక్ట్రీషియన్లు వెంకటేశ్వరరావు, మేకల వీర శివాజీ, మాదిరెడ్డి ఈశ్వర్, దుర్గాప్రసాద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అపార్ అనుశక్తి కంపెనీ ఏరియా మేనేజర్ కిషోర్, పూర్వ సంఘ అధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...