Skip to main content

అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి.



అక్కినేని నాగేశ్వరరావు విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయుడు..

అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి..

కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

గుడివాడ: 

     తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మహానటుడు, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయుడని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు.

      గురువారం ఉదయం ఆయన గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడలో సరైన విద్యాసంస్థ లేని లోటును గమనించి ఎందరో మహనీయుల కృషితో కళాశాల ఏర్పాటు అయిందని గుర్తు చేస్తూ, నేటితరం వారందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

      కళాశాలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పూర్వ విద్యార్థులు కళాశాల మరింత అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. వారి సహకారంతో కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం తనవంతు రూ.50 లక్షలు ప్రకటించిన ఈనాడు విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందిస్తూ, వారే దానిని నిర్వహించేలా చూడాలని కోరారు. 

       విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతూ, అవి ఉపాధి అవకాశాలను పెంపొందించే విధంగా నైపుణ్యాభివృద్ధితో కూడిన మార్పులు ఉండాలని ఆకాంక్షించారు. 

      యువత చదువుతోపాటు సంస్కారాన్ని పెంపొందించుకోవాలని, పదిమందికి ఉపయోగపడే విధంగా ఆదర్శవంతమైన జీవితం జీవించాలన్నారు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులను విడనాడకుండా కడవరకు వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు లోను కాకుండా వాటికి దూరంగా ఉండాలన్నారు. అవసరం మేరకు సాంకేతికతను ఉపయోగిస్తూ దుర్వినియోగాన్ని నిరోధించాలని, ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని, బదులుగా సబ్జెక్టు, జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఉద్బోధించారు.

      ప్రపంచ దేశాలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళుతోందని, రాబోయే కాలంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్నారు. సమాజంలో, కళాశాలలో, కుటుంబంలో అందరూ ఐక్యమత్యంగా ఉండాలని తద్వారా దేశ అభివృద్ధి వేగంగా ముందుకు సాగేందుకు తోడ్పాటునందించాలని మాజీ ఉపరాష్ట్రపతి కోరారు. 

     కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు, కైకలూరు నియోజకవర్గాల శాసనసభ్యులు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన రాంజీ, కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే శ్రీనివాసరావు, అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని వెంకట్, జ్యోత్స్న, కళాశాల ప్రిన్సిపల్ పి జే ఎస్ కుమార్, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...