Skip to main content

అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన వంటశాల నిర్మాణం

మచిలీపట్నం:

అక్షయ పాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన వంటశాల నిర్మాణం చేపట్టడం ఒక బృహత్తర కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం గుడివాడలో స్థల దాత వి కే ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య భూ విరాళం ఇచ్చిన 1.50 ఎకరాల స్థలంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ప్రవాస భారతీయులు వర్ణ పువ్వాడ ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్న కేంద్రీకృత మధ్యాహ్న భోజన వంటశాల భూమి పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఇప్పటికే పాఠశాలలకు, అన్న క్యాంటీన్లకు ఎంతో అత్యుత్తమ ప్రమాణాలతో నాణ్యత గల ఆహారాన్ని సరఫరా చేస్తోందని ప్రశంసించారు. వారు గుడివాడ చుట్టుపక్కల ఉన్న పాఠశాలల కు మధ్యాహ్న భోజనం సరఫరా చేయుటకు సొంతంగా వంటశాల నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అందుకు స్థలదాత కోదండరామయ్య, వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న వర్ణ పువ్వాడలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 

గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ విలువలు ఉన్న ఒక గొప్ప సంస్థని వారు వంటశాల నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప కార్యక్రమం అన్నారు.
అతి తక్కువ ధరకు అత్యంత శుభ్రమైన నాణ్యమైన ఆహారం అందించడం అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ప్రత్యేకత అన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ద్వారా కావలసిన వారికి ఆహారం సమకూరుస్తున్నారన్నారు. 

గుడివాడలో వంటశాల నిర్మాణం చేపట్టడం అందుకు స్థలం ఇచ్చిన కోదండరామయ్య, అమెరికాలో ఉంటూ జన్మభూమి గుడివాడను మరిచిపోకుండా వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న వర్ణ పువ్వాడ ఎంతో అభినందనీయులు అన్నారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు వంశీధర దాస మాట్లాడుతూ వంటశాల నిర్మాణం ఒక అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో 23 లక్షల మంది ప్రజలకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు. 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానమై మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నామన్నారు. 
స్థానికులు కోదండరామయ్య స్థలం ఇచ్చినందుకు, అమెరికా వాసి వర్ణ పువ్వాడ వంటశాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
 
గుడివాడ చుట్టూ ఉన్న 150 పాఠశాలల్లో చదువుకుంటున్న 10 వేల మంది పిల్లలకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందించే విధంగా వంటశాల నిర్మిస్తున్నామన్నారు

ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ పిఆర్ రఘునందన దాస, స్థల దాత కోదండరామయ్య
వంటశాల దాత వర్ణ పువ్వాడ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ ఆర్డిఓ జి.బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత రైస్ మిల్లర్ వీరయ్య చౌదరి, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తుమ్పూడి సాంబశివరావు, కృష్ణాజిల్లా పల్సస్ సంఘం అధ్యక్షులు టంగుటూరి శ్రీనివాసు, 
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాటూరు రంగనాథ్ పలువురు ప్రజలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...