Skip to main content

ఆర్కే కాలేజీలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

 మచిలీపట్నం:

   పవిత్ర క్రిస్మస్ పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం మచిలీపట్నం ఆర్కే కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

       ఈ సందర్భంగా ఆర్కే కళాశాల అధినేత బండి రామకృష్ణ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ పండగ ద్వారా పరస్పర అభినందనలు తెలియజేసుకోవడం మంచి సంస్కృతి సంప్రదాయానికి నాంది అని అన్నారు. తమ కళాశాలలో గత 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

      ఎల్ ఇ ఎఫ్ చర్చ్ నిర్వాహకులు టీ ప్రభాకర్ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని నిన్ను వలె ఇతరులను ప్రేమించమని బైబిల్ సూక్తులు అందరూ పాటించాలని అన్నారు. ఆర్కే కళాశాల ద్వారా ఎందరో పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్న బండి రామకృష్ణ వంటి వ్యక్తులను ప్రోత్సహించాలని అన్నారు.  
    
          మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ సర్వ మతాల సారాంశం ఒకటేనని, మానవసేవే మాధవసేవ అని అన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని అన్నారు.  

       విశ్రాంత ఎడిషనల్ఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ యేసు బోధనలు మంచి మార్గానికి నాంది ప్రస్తావనని అన్నారు. సెమీ క్రిస్మస్ పండుగ ఒకరినొకరు కలుసుకోవడం, స్వీట్లు పంచుకోవడం, అభినందనలు తెలియజేసుకోవడం మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. 

       బండి సత్యనారాయణ ప్రార్ధనతో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. సెమీ క్రిస్మస్ భారీ కేకును బండి రామకృష్ణ దంపతులు కట్ చేసి విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేశారు. క్యాండిల్స్ తో సెమీ క్రిస్మస్ పాటలు పాడారు. విద్యార్థినీ విద్యార్థులు యేసు జననం తెలియజేస్తూ పాడిన పాటలు అందర్నీ అలరించాయి. 

      ఈ కార్యక్రమంలో దైవ సేవకులు ఎం. ఏసు పాదం, జాన్ కెనడి, గౌరీ శంకర్, ప్రభాకర్ ప్రేమ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ డి. శివరామకృష్ణ హాజరయ్యారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...