Skip to main content

పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

        జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

      శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావులతో కలిసి పరిశ్రమలు తదితర అంశాల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా గత 2 సంవత్సరాల లోపు మల్లవల్లి, వీరపనేని గూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని దాదాపు 400 మంది పారిశ్రామికవేత్తల జాబితా తయారుచేసి వారి యూనిట్లు వెంటనే నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీన వారితో ఒక సమావేశం నిర్వహించి అందరిని ప్రోత్సహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులకు ముందుగా తెలియజేయాలన్నారు.

         జిల్లాలోని 20 మంది జిల్లా అధికారులను ఎంపిక చేసి పరిశ్రమలు వేగంగా నెలకొల్పుటకు ప్రత్యేక అధికారులుగా నియమించాలన్నారు. అలాగే 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకను పరిశ్రమలు నెలకొల్పని వారికి ఎందుకు వాటిని రద్దు పరచకూడదో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేయాలన్నారు. 

         ఏపీఐఐసీ పేరు మీద భూములు ఉంటేనే మ్యుటేషన్ చేయడానికి వీలుంటుందని స్పష్టం చేస్తూ మ్యుటేషన్ జాబితా సిద్ధం చేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇదివరకే మ్యుటేషన్ చేసి కూడా 22 ఏ జాబితాలో ఉంటే అటువంటి భూముల జాబితా సిద్ధం చేసి 22 ఏ జాబితా నుండి తొలగింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

       ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ర్యాంపు పురోగతి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాపారం పెంచేందుకు సరైన మార్గ నిర్దేశం చేసే కన్సల్టెంట్లను గుర్తించాలన్నారు.

         కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపి, పీఎం ఎఫ్ ఎం ఈ పథకాల అమలులో పురోగతి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఎం ఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకులలో 39 దరఖాస్తులు ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. కేవలం బ్యాంకు రుణాలు తీసుకొని వ్యాపారం చేయని వారికి సిఫారసు చేయరాదని, నిజంగా వ్యాపారం చేయాలని ఆసక్తి, తపనపడే వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.

      ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓ లు స్వాతి, జీ.బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డి ఆర్ డి ఏ, డ్వామా, మెప్మా పిడీలు శివప్రసాద్, హరిహరనాథ్, సాయిబాబు, జడ్పీ డిప్యూటీ సీఎం ఆనంద్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహలు, డీఐసీ జీఎం ఆర్ వెంకటరావు, ఏపీఐఐసీ జడ్ ఎం బాబ్జి, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, మార్క్ఫెడ్ డి ఎం మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...