Skip to main content

కృష్ణా జిల్లా పోలీస్

 

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోనికి తీసుకుని సుమారు 5,60,000/- విలువ కలిగిన 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. బుధవారం మీడియా సమావేశంలో కేసు పూర్వాపరాలను  కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, వెల్లడించారు.

      గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 16, డిసెంబర్ 2025 సాయంత్రం 4 నాలుగు గంటలకు BB గూడెం అండర్పాస్ వద్ద గన్నవరం ఎస్ఐ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ODO2 BC 3555 నెంబర్ కలిగిన తెలుపు రంగు CRETA కారు లో ఉన్న వ్యక్తి పోలీస్ వారిని గమనించి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఆ వాహనాన్ని నిలువరించి తనిఖీలు చేపట్టారు. 

       ఆ కారులో సుమారు 5,60,000/- విలువ కలిగిన ఒక్కొక్క ప్యాకెట్ కేజీ చొప్పున మొత్తం 112 ప్యాకెట్లు గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అందులో ఉన్న పూణే పట్టణం, మహారాష్ట్రకు చెందిన దీపక్ తుపే s/o అబాజీ తుపే (39 సంవత్సరాలు) అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని  విచారించగా అతడు పూణే కు చెందిన వైష్ణవి లవన్ అనే వ్యక్తి గంజాయి కోసం ఒరిస్సా రాష్ట్రంలోని బలంగీర్ కు పంపించడం జరిగిందని. ఈ గంజాయిని అక్కడ ఉన్న రాజ్ కుమార్ మరియు సురాన్ కర్ణ అనే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి పూణేకు తీసుకు వెళ్తున్నట్లుగా, నేరాన్ని అంగీకరించడంతో అదుపులోనికి తీసుకొని అతనిపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో cr.no 290/2025 u/s 8(b) r/w 20(b) (2) (c)of NDPS Act ప్రకారం కేసు నమోదు చేశారు.

       గంజాయి అదుపులోనికి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ఒక వ్యక్తిని, రవాణా చేస్తున్న కారును, 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులను అందజేయడం జరిగింది.

       ఎస్ పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం గానీ రవాణాలను గాని జిల్లాలో ఎక్కడ జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది. కేవలం రవాణా దారుల్ని మాత్రమే కాక ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని, సరఫరా చేస్తున్న వారిని కూడా అదుపులోనికి తీసుకునేలా చర్యలు చేపడుతున్నాం.

      రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల్లో గంజాయి నిర్మూలన కూడా ఒకటి కావున కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేస్తుంది. అంతేకాక గంజాయి రవాణా చేసేవారు సేవించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ వారిపై NDPS Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేయాలని చూసిన, వారికి సహకరించిన వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. సులభంగా వచ్చే నగదు పై ఆశపడి అనవసరంగా జీవితాలను కేసులు పాలు చేసుకోవద్దని తెలియజేశారు.

      అలాగే గంజాయి కి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు మరియు ఈగల్ టీం 1972 హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

     ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు గారు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ బి సత్యనారాయణ గారు, గన్నవరం డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు గారు, గన్నవరం CI BV శివ ప్రసాద్ గారు, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...