Skip to main content

రాష్ట్ర సచివాలయంలో మొదటిరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్

 
మచిలీపట్నం:
      కొన్ని గంటల్లో ఈ--కార్యాలయ దస్త్రాలను పరిష్కరించడంలో నలుగురు జిల్లా కలెక్టర్లు నిలవగా అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 

బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, మంత్రివర్గ సహచరులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలసి మొదటిరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత 3 నెలలుగా జిల్లాల వారీగా ఈ--కార్యాలయ దస్త్రాల పరిష్కారం పై సమీక్షిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ తో పాటు నలుగురు జిల్లా కలెక్టర్లు ఒకరోజు కంటే తక్కువగా కొన్ని గంటల్లోనే ఈ- కార్యాలయ దస్త్రాలను పరిష్కరించారన్నారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రథమ స్థానంలో నిలిచారని అభినందించారు.

క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో సిబ్బంది ముఖ్యంగా వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ఉదయమే గ్రౌండ్ ట్రూతింగ్ కోసం వెళ్తుంటారని వారికి విధుల హాజరు నుండి మినహాయింపు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

అంతకు మునుపు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై సమీక్షిస్తూ 74 శాతం మంది విధులకు హాజరవుతున్నట్లు, 26% మంది హాజరు వేయడం లేదని, కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ప్రజాభిప్రాయం ఉందని రాష్ట్ర ఐ టి ఈ అండ్ సి ఆర్టీజియస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ చెప్పడంతో జిల్లా కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ కార్యాలయానికి రాని వారి పట్ల కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్షేత్ర పర్యటనకు వెళ్లిన వారికి మినహాయింపు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కార్యదర్శికి సూచించారు.

భూగర్భ జలాలపై జిల్లాల వారీగా విశ్లేషిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణాజిల్లాలో ఈ ఏడాది జూన్ 1 వ తేదీ నాటికీ 9.45 మీటర్ల లోతులో నీరు ఉంటే ప్రస్తుతం నవంబర్ 25 నాటికి 7.69 మీటర్ల లోతుకు వచ్చిందన్నారు. పంచాయతీరాజ్ శాఖతో ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే వర్షాల తర్వాత పెంపుదల చేయాలని సూచించారు.

ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ వివరణ కోరగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ జిల్లాల్లో బాపులపాడు, గన్నవరం వంటి నాలుగు మండలాలు అప్ల్యాండ్ లో ఉన్నాయని, అక్కడ 3 నెలల్లో భూగర్భ జలాలు పెంపుదలకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. 

ఈ కాన్ఫరెన్స్ లో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజ, బీసీ సంక్షేమ అధికారి రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర కుమార్, జడ్పీటీసీఈఓ ఆనంద్ కుమార్, డిసిఓ చంద్రశేఖర్ రెడ్డి, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డిపిడిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...