Skip to main content

మానవ హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు అండగా: జడ్జి రామకృష్ణయ్య

... 
కృష్ణాజిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య.....

 మచిలీపట్నo:

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం మచిలీపట్నం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయశాఖ మరియు ఎన్ఎస్ఎస్ (NSS )యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు మరియు విద్యార్థులు తో ర్యాలీ నిర్వహించారు. 
ఈ సందర్భంగా న్యాయమూర్తి రామకృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని అన్నారు .జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి హోదా కలిగిన అధికారి మానవ హక్కుల కోర్టుకు న్యాయమూర్తిగాను ,రాష్ట్రస్థాయిలో హైకోర్టు జడ్జి హోదా కలిగిన న్యాయమూర్తి జాతీయ స్థాయిలో , సుప్రీంకోర్టు హోదా కలిగిన న్యాయమూర్తులు మానవ హక్కులకోర్టుకు చైర్మన్లు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో గాని ఇతర ప్రాంతాల్లో గాని పౌరులు హక్కులకు భంగం కలిగినప్పుడు తగిన ఆధారాలతో మానవ హక్కుల కోర్టు ఆశ్రయించవచ్చని అన్నారు. ఏ విధమైన కోర్టు ఫీజులు లేకుండా తగిన పరిహారం పొందే అవకాశం ఉందని తెలియజేశారు .ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు 

.కళాశాల ప్రిన్సిపాల్ P. లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యార్థి దశనుండే చట్టాలు పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు .తొలుత న్యాయమూర్తి లేడీ యాంప్తిల్ కళాశాల నుండి మానవ హక్కుల పరిరక్షణ తెలియజేస్తూ విద్యార్థినిలు అధ్యాపకులతో ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లొ NSS ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాధ్ బాబు. అధ్యాపకులు సుందర లక్ష్మి, విజయశ్రీ ,మృదుల ,రత్న ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...