Skip to main content

పవిత్ర వివాహ బంధాన్ని అపహాస్యం చేసిన ఉపాధ్యాయులు....

మచిలీపట్నం :

   భారతదేశంలో హిందూ సాంప్రదాయ వివాహంతో ముడిపడిన బంధంతో భార్య భర్తలు ఇరువురు నూరేళ్లు కలిసి జీవిస్తారు...... ఆ వివాహ బంధాన్ని ఎంతో గౌరవిస్తారు....

     గుడివాడకు చెందిన సంగీతం టీచర్ మండవల్లికి చెందిన ఎస్ జి టి టీచర్ ఉపాధ్యాయ వృత్తి లో పవిత్ర వివాహ బంధాన్ని అపహాస్యం చేశారని తెలుస్తోంది... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.

      సేకరించిన సమాచారం ప్రకారం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అన్నపూర్ణాదేవి అనే మహిళ కైకలూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడ రాఘవేంద్రరావు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే అతను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కండిషన్ పెట్టాడు. దీనితో ఆమె పట్టుదలతో తిరుపతిలో కోచింగ్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. రాఘవేంద్రరావు కు కూడా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. 

        అన్నపూర్ణ కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక రాఘవేంద్రరావును పెళ్లి చేసుకోవాలని కోరగా ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశారు. ఈ సహజీవనానికి గుర్తుగా ఒక కుమార్తె జన్మించింది. దీనితో రాఘవేంద్రరావు అన్నపూర్ణ ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఇరువురి మధ్య చట్టబద్ధంగా వివాహం జరిగిందో లేదో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం లో ఏముంది అని అనుకుంటున్నారా?  ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 

     అన్నపూర్ణ తిరుపతి కోచింగ్ లో ఉన్న సమయంలో ఓ వ్యక్తితో పరిచయం అయ్యి, అక్కడ కూడా ఒక ప్రేమాయణం నడిపింది అని తన సొంత భర్త తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై తిరుపతి మహిళ పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేంద్రరావు కు సైతం కొన్ని సంవత్సరాల క్రితమే ఇంకో మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అన్నపూర్ణ, రాఘవేంద్రరావుకు  ఇద్దరికీ  రెండో వివాహమే. 

     భార్య భర్తలు ఉండే విడాకులు పొందకుండా వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. నేరమని తెలిసినా రెండో వివాహం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఒకరికొకరు గతంలో వివాహం జరిగిందని చెప్పకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. రాఘవేందర్రావుకు అన్నపూర్ణ కు జన్మించిన కుమార్తెను రాఘవేందర్ మొదటి భార్య వద్ద ఆమెకు తెలియకుండా పెంచడం గమనార్హం. 

       విద్యార్థులకు కుటుంబ సంబంధాల గురించి బోధించాల్సిన ఉపాధ్యాయులు భార్యాభర్తల బంధానికి విలువ ఇవ్వకుండా ఏమాత్రం గౌరవించకుండా వివాహం చేసుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు  ఈ విషయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని తెలుస్తోంది... మోసపూరితంగా చేసుకున్న బంధం ఇప్పుడు మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు దారితీసింది. 

      రాఘవేంద్రరావు తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆర్థికంగానూ తనను వాడుకున్నాడని మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ లో సంగీతం టీచర్ అన్నపూర్ణ ఫిర్యాదు చేసింది. అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదులో గుడివాడ టూ టౌన్ కు చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్రరావు సోదరుడు కూడా ఉన్నాడు. 

     అన్నపూర్ణ ప్రేమ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో పోలీసుల విచారణ లో తేలనుంది. సంగీతం టీచర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మచిలీపట్నం మహిళ పోలీస్ స్టేషన్ పోలీసులు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...