Skip to main content

జిల్లాలో గ్రామాలకు చెత్త సేకరణ కోసం 8 ఈ-ఆటోలు, 171 తోపుడు బండ్లు పంపిణీ


మచిలీపట్నం:

గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్తబుట్టలతో ఈ - ఆటోలు, తోపుడుబండ్లను ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చెత్త సేకరణ ఈ--ఆటోలు, తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, డిపిఓ డా. జే అరుణ స్వయంగా ఈ--ఆటోలను నడిపి అందరిని ఆకర్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా వచ్చే 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీసిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. 

ఇందులో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛ ఆంధ్ర అని అంటూ ఇందులో భాగంగా ప్రతి పల్లెటూర్లోనూ వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇది చాలా శాస్త్రీయంగా ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం అన్నారు.
జిల్లాలో 8 ఈ---ఆటోలు, 171 తోపుడు బండ్లను చెత్త సేకరణ కోసం గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగి వాటిని వేరుచేసి చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఈ- ఆటోలోనూ, తోపుడుబండ్ల లోను వేరువేరు రంగులతో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామన్నారు. 

అందులో ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలో తడి చెత్త, ఎరుపు రంగు చెత్త బుట్టలో హానికర వస్తువులు, నీలం రంగు చెత్తబుట్టలో పొడి చెత్త వేయాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డిపిఓ డాక్టర్ జె అరుణ, డి ఎల్ పి ఓ రహంతుల్లా, ఏవో సీతారామయ్య పలువురు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

https://youtu.be/l4LJR3ghwvA?si=q0DPcAieBDQIX29v

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...