Skip to main content

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 63 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 మచిలీపట్నం:
      జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు 63 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా ఎస్పీ  వి.విద్యాసాగర్ నాయుడు  ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు  ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సిహెచ్ రాజా, వి ధీరజ్ నీల్, టి.విద్యశ్రీ  ఇతర పోలీసు అధికారులు పాల్గొని హోంగార్డ్స్ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు పెరేడ్ కమాండర్ P.V సాంబశివరావు నుండి గౌరవ వందనం స్వీకరించి, పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వాహనంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్)  ప్లటూన్ వారీగా సిబ్బంది యొక్క టర్న్ అవుట్ ను పరిశీలించారు.
 అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం ఏర్పడిన రక్షక దళం హోమ్ గార్డ్స్ అని, కేవలం అతి తక్కువ గౌరవ వేతనంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో హోంగార్డ్ రక్షక దళం ఏర్పాటైందని, జిల్లావ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతూ హోంగార్డులు తమ సేవలను పోలీసులతోపాటు రక్షణ, ట్రాఫిక్, పోలీస్ స్టేషన్ విధులు, డ్యూటీ డ్రైవర్లుగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

   ఎవరైనా హోమ్ గార్డ్ పదవీ విరమణ చెందినా లేదా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబ సభ్యులకు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 
  అనంతరం హోంగార్డ్ సిబ్బంది ప్లటూన్ల వారీగా అద్భుతమైన కవాతును ప్రదర్శిస్తూ హోంగార్డ్ సిబ్బంది ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇతర పోలీసు అధికారులతో కలిసి హోం గార్డ్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో హోంగార్డు లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి లక్ష్మి టాకీస్ సెంటర్ వరకు అనంతరం పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...