మచిలీపట్నం:
జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 10 నుండి 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెనమలూరు లోని అయాన్ డిజిటల్ జోన్ కానూరులోను, పెడన మండలంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల నందమూరులోను, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోనూ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉందన్నారు.
పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మూడు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునే విధంగా కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షలను సజావుగా నిర్వహించుటకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్క్వాడ్లుగా నియమించబడిన శాఖాపరమైన అధికారులు పరీక్షా కేంద్రాలను తరచూ తనిఖీ చేసి పరీక్షలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు.
పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా అంతర్జాలం, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ కే విద్యాసాగర్ నాయుడు, డిఇఓ జిల్లా విద్యాధికారి పి వి జె రామారావు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment