Skip to main content

287 రైతు సేవ కేంద్రముల ద్వారా ధాన్యం సేకరణ : జాయింట్ కలెక్టర్ ఎం నవీన్

మచిలీపట్నం:

      శ్రీయుత గౌరవనీయులైన కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గారు జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజనుకు గాను ధాన్యము సేకరణ చేయుటకు 287 రైతు సేవ కేంద్రములు ఏర్పాటు చేయటం జరిగినది. 

కృష్ణా జిల్లాలో గత సంవత్సరం ఈ రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయగా ఈ సంవత్సరం 2,46,473 మెట్రిక్ టన్నుల ధాన్యమును 29,668 మంది రైతుల వద్ద నుండి సేకరణ చేసి 502.50 కోట్ల రూపాయలు రైతుల 48 గంటలలో రైతుల ఆధార్ కు అనుసంధానం అయిన రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమచేయటం జరిగినది.

 రైతుల వద్ద నుండి ధాన్యము సేకరణ చేయుటకు నేటి వరకు 72,98,622 గోనె సంచులు జిల్లాలోని రైతు సేవ కేంద్రముల వద్ద రైతులకు అందుబాటులో ఉంచటం జరిగినది.

 జిల్లాలోని ధాన్యమును మిల్లులకు తరలించుటకు 4,199 వాహనములను అందుబాటులో ఉంచటం జరిగినది. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు జిల్లా, డివిజన్, మండల మరియు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారితో నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటించి ధాన్యం సేకరణ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొనుటకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు మరియు సూచనలు ఇవ్వడమైనది.

 ఈ ఖరీఫ్ సీజనులో కనీస మద్దతు ధర (MSP) ప్రతి క్వింటాల్ ధాన్యముకు సాధారణ రకం రూ.2,369/- చొప్పున మరియు గ్రేడ్- ఏ రకానికి రూ.2,389/- చొప్పున ప్రతి రైతునకు పూర్తి పారదర్శకంగా నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్ కు ఆధార్ నెంబరు ఆధారముతో జమ చేయడం జరుగును అని తెలియజేయడమైనది.

 వాతావరణము అనుకూలముగా ఉన్నందున జిల్లాలోని రైతులందరూ పరిపక్వం లేని ధాన్యమును ఎట్టి పరిస్థితులలో కోతలు కోయరాదని మరియు పరిపక్వము చెందిన ధాన్యమును పూర్తిగా ప్రభుత్వము వారు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకుని శుద్ధి చేసుకుని రైతు సేవా కేంద్రము ద్వారా విక్రయించి కేంద్ర ప్రభుత్వము వారు నిర్దేశించిన కనీస మద్దతు ధర పొందవలసిందిగా కోరడమైనది. 

మద్దతు ధర పొందుటకు పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలు నాణ్యతా ప్రమాణాలు 3. ఎ) స్యర్థి సనార్థాలు మట్టి పెల్లలు మొంక Verse vege ganaga కృష్ణా జిల్లాలోని రైతులకు ధాన్యము విక్రయించుటలో ఎటువంటి సలహాలు మరియు ఫిర్యాదుల కొరకు సంబంధిత రైతు సేవ కేంద్రము సిబ్బందిని, మండల మరియు డివిజన్ స్థాయి అధికారులను సంప్రదించవలెను.

 వారి వద్ద సమస్య పరిష్కారం కాని యెడల జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ 8247693551 ను సంప్రదించవలెను 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...