Skip to main content

డిసెంబర్ 20వ తేదీన నూతన తరహా న్యాయ సేవల శిబిరం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య

మచిలీపట్నం: 

     ఈ నెల 20వ తేదీన పెడనలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధికారులను ఆదేశించారు.

      సోమవారం మధ్యాహ్నం ఆయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.
       ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారంతో ఈ నెల 20వ తేదీన పెడన మండలంలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న పెడన ఫంక్షన్ హాల్లో నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని తెలిపారు. 

      కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరిస్తూ, సమాజంలో బాల్య వివాహాల నిషేధం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి సాంఘిక దురాచారాలపై అవగాహనతోపాటు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల సద్వినియోగంపై న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనితోపాటుగా డిఎల్ఎస్ఎ ద్వారా సామాన్యుడికి ఉచిత న్యాయ సహాయం అందించే అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులు, సాంఘిక, గిరిజన, వికలాంగులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలు ప్రజలకు వారు అందిస్తున్న పథకాలు, సేవలను వివరిస్తూ ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సాంఘిక దురాచారాలపై సాంస్కృతిక లఘునాటికలు కూడా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.

         సమావేశంలో జిల్లా ఇంచార్జ్ డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కార్యక్రమ నోడల్ అధికారి డిఆర్డిఏ పీడీ హరిహరనాథ్, గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐసిడిఎస్, గృహ నిర్మాణం, విద్య, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...