Skip to main content

10వ తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం


మచిలీపట్నం:

విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ 10 వ తరగతి పరీక్షలను ధైర్యంగా వ్రాసి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. 

బుధవారం ఉదయం అవనిగడ్డ లోని విద్యానికేతన్ పాఠశాలలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోనీ 10 వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

తొలుత జిల్లా కలెక్టర్, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పురిటిగడ్డ తెలుగు భాష ఉపాధ్యాయురాలు డా. ఓలేటి ఉమా సరస్వతి రూపొందించిన తేనె చినుకులు అనే బడి పిల్లల కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ఎలా రాయాలో అని భయపడవద్దని, ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే పరీక్షలు సులభంగా వ్రాయవచ్చన్నారు. 

విద్యార్థులు చదువుకుంటూ పోవడం కాకుండా చదివిన తర్వాత కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఆ చదివిన అంశం పైన ఎంతవరకు గుర్తుకు వస్తుందో మననం చేసుకోవాలన్నారు ఆ విధంగా చేసినప్పుడే వారికి చదివిన విషయాలపైన పట్టు సాధించవచ్చన్నారు. 

రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని ఆ సమయంలోనే మెదడు అప్రమత్తమవుతుందన్నారు.  ఇవన్నీ కూడా తన స్వానుభావంతో చెబుతున్నానని కలెక్టర్ తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ తాను కూడా కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానన్నారు. పదో తరగతి నుంచి తాను బాగా చదవడం మొదలు పెట్టానని, కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు ఎలా చదువుకోవాలి ఏ పద్ధతి పాటిస్తే చదువుకున్న విషయాల పైన పట్టు సాధించవచ్చనీ అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరించారు.

బాగా చదువుకుంటూ ఆహారం పైన కూడా శ్రద్ధ పెట్టాలని చాలామంది సరిగా తినకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.
చదివేముందు నాలుగైదు సార్లు యోగాలో భాగంగా ప్రాణాయామం చేయడం కూడా ముఖ్యమన్నారు.
సమయం ఉంటే చదివిన విషయాలను వ్రాస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుందన్నారు.


బాగా కష్టపడి చదవాలని పరీక్షల్లో కొద్దిగా మార్కులు తగ్గినా నిరాశ చెందవద్దని, ఒక్క పదవ తరగతితో అంతం కాదని జీవితంలో ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నాయన్నారు.

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని విద్యార్థులందరూ బాగా చదువుకొని నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొని అందుకు తగ్గట్టుగా అన్ని సబ్జెక్టులలోనూ అవగాహన కలిగించి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. 

వచ్చే నెలలో సాంస్కృతిక, లలిత కళల పోటీలు నిర్వహిస్తామని, అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. ఏ కళలో ఎవరికి అభిరుచి ఉన్నా పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. 

అనంతరం తేనె చినుకులు పుస్తకాన్ని రూపొందించిన తెలుగు ఉపాధ్యాయురాలు ఓలేటి ఉమా సరస్వతిని, విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన కరస్పాండెంట్ లంక ప్రసాద్ ను, కౌసల్ కార్యక్రమంలో దివిసీమలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి చావా మోక్షజ్ఞను జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా విద్యాధికారి సుబ్బారావు, విద్యానికేతన్ కరస్పాండెంట్ లంకే ప్రసాద్, పలువురు ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి మండలాలలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...