Skip to main content

రసాబాసగా కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ని అవమానించేలా మాట్లాడిన జడ్పీ సీఈఓ పై ఆగ్రహం

సీఈవో ను సస్పెండ్ చేయాలి అంటూ కృష్ణాజిల్లా జడ్పిటిసిలు,  ఎంపీపీలు పోడియం వద్ద నిరసన
శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో  చైర్ పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగింది. జడ్పీ పాలకవర్గం ఆమోదం లేకుండా 24 కోట్ల రూపాయల విలువైన సుమారు 424 పనులను జడ్పీ సీఈవో కన్నమ నాయుడు రద్దుపరిచారని తీవ్రమైన పదజాలంతో సీఈఓ కన్నమ్మ నాయుడును జడ్పీటీసీలు విమర్శించారు. సీఈఓ ఒంటెద్దు పోకడలను చైర్ పర్సన్ ఉప్పల హారిక ఖండించారు. జనవరి 26 రాజ్యాంగ దినోత్సవం రోజున జడ్పీ చైర్పర్సన్ పదవి అంటే ఒక కాపల కుక్కని సీఈఓ అన్నారని చైర్ పర్సన్ జడ్పిటిసి సభ్యులు ఆరోపించారు. 
చైర్ పర్సన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీలు పోడియం దగ్గర బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలు సభ నిర్వహించకుండా అడ్డుకున్నారు. జడ్పీ సీఈవో కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరుష పదజాలం వాడిన సీఈఓ కే కన్నామ నాయుడు ని సస్పెండ్ చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో సంబంధిత ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని వైస్ చైర్మన్లు గుడిమళ్ళ కృష్ణంరాజు, గరికిపాటి శ్రీదేవి ఇతర ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభా వేదిక వద్ద బైఠాయించారు. ఈ అంశంపై సుదీర్ఘ వాదనల అనంతరం, సభ్యుల కోరిక మేరకు జడ్పీ సీఈవో సవరణ ఉత్తర్వులను జారీ చేశారు. 
జెడ్పీటీసీ సభ్యులు చేపట్టిన పనులను వారితో చర్చించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఎంత మాత్రం సరైనది కాదని శాసనమండలి సభ్యుడు మొండితోక అరుణకుమార్ అధికారులకు సూచించారు.

జిల్లా పరిషత్ సభ్యులు ప్రతిపాదించిన వర్కులు కనీసం జడ్పీటీసీ సభ్యులకు చైర్పర్సన్ కి తెలియపరచకుండా రద్దు పరిచే విధంగా నిర్ణయాన్ని తీసుకున్న జడ్పీ సీఈఓ పై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కలెక్టర్ ని కోరారు.

 సీఈవో తప్పులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమర్ధిస్తున్నారని ఉప్పల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పిటిసి, ఎంపీపీ లకు జరిగిన అవమానాన్ని సభ్యులందరూ తీర్మానించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు.
సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాక్కియ, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...