మచిలీపట్నంలో ఏకైక తెలుగు దినపత్రిక వి న్యూస్ 10వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను వేడుక ఫంక్షన్ హాల్ లో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తదితరులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వి న్యూస్ ఎడిటర్ ప్రేమ్ నాథ్ కృషి అమోఘం అని పేర్కొన్నారు.
డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వి న్యూస్ ముందుందని పేర్కొన్నారు.
మంత్రి రవీంద్ర, బండి రామకృష్ణ లు వి న్యూస్ ఎడిటర్ తోకల ప్రేమ్ నాథ్ ను శాలువతో అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నందం రామారావు ను మంత్రి రవీంద్ర శాలువతో సత్కరించి, మొమెంటో అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి వి ఫణి కుమార్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, డివిజన్ ఇన్చార్జీలు ఊకంటి రాంబాబు, తలారి రాంబాబు, మంచాల రాంబాబు, జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు, బి సి సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం, మైనారిటీ నాయకులు జెక్స్ టైలర్ అధినేత ఎండీ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment