పిఎన్జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 90 రోజుల్లో కన్వర్షన్ పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్
జిల్లాలో ఎల్పిజి నుండి పిఎన్జి వైపు మారాలి మచిలీపట్నం : జిల్లాలో వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్పిజి గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పిఎన్జి అదేవిధంగా ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్ కోరారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ మీకోసం కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీల నుండి సుమారు 450 కిలోమీటర్ల మేర పిఎన్జి పైప్లైన్ అందుబాటులో ఉన్నందున, ఆ సౌకర్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మున్సిపల్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు తక్షణమే పిఎన్జి వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. పిఎన్జి కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని సంస్థలు 90 రోజులలోపు పిఎన్జికి మారకపోతే, వారి ఎల్పిజి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పిఎన్జికి మారాల్సిన 417 పరిశ్రమలు, 179 ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్లు, 8 ప్రధాన దేవాలయా...