మచిలీపట్నం:
జిల్లాలోని స్మశాన వాటికలను పి....4 కింద అభివృద్ధి చేయుటకు ఆసక్తిగల దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఒక వీడియో ద్వారా ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలోని స్మశానవాటికలను పి..ఫోర్ కింద అభివృద్ధి చేయదలిచామన్నారు.
ఎవరైనా ఆసక్తిగల దాతలు ముందుకు వస్తే స్మశాన వాటికల రూపు రేఖలను మార్చి మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు
మనతోపాటు జీవించిన మన కుటుంబ సభ్యులు మనల్ని వీడి వెళ్లినప్పుడు వారి అంతిమయాత్ర సజావుగా జరిగే ప్రదేశం గౌరవప్రదంగా ఉండాలని ప్రధాన ఉద్దేశం అన్నారు
అలా చేయడం వలన ఆరోజు కుటుంబ సభ్యులను కోల్పోయి బాధల్లో ఉన్నవారు సజావుగా దహన సంస్కారాలు చేసుకోగలిగే తృప్తి ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో స్మశానవాటికల అభివృద్ధి చాలా అవసరం అన్నారు
ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నవారు జిల్లా రెవిన్యూ అధికారి చంద్రశేఖర రావు ను సెల్ నంబర్ 98499 03961 లో గాని లేదా విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజును సెల్ నంబర్ 93466 00855 లో గాని సంప్రదించాలని కోరారు.
దాతలు వారికి సంబంధించిన వారి తల్లిదండ్రుల పేర్లు గాని వారి కుటుంబంలో పెద్దవారి పేర్లు పేరిట స్మశానవాటికలను అభివృద్ధి చేస్తామన్నారు.
మన గ్రామం మన జిల్లా మనకు ఎంతో ఇచ్చింది మన గ్రామానికి మన వంతు ఎంతో కొంత ఇచ్చేందుకు ఒక సదవకాశం లభించిందన్నారు. అందరూ ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Post a Comment