Skip to main content

క్షతగాత్రులైన సిబ్బందిని పరామర్శించిన జిల్లా ఎస్పీ

మచిలీపట్నం :

చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించి, ప్రమాదానికి దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు.

ఇటీవల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా విక్రయిదారులు, తయారీదారులు అనధికారికంగా నిల్వ ఉంచిన బాణసంచా పదార్థాలను సీజ్ చేసి, కోర్టు ఉత్తర్వుల మేరకు డిస్పోస్ చేసే క్రమంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ వెనుక వైపు గల గది నుండి బాణసంచాను వాహనంలోనికి ఎక్కించే క్రమంలో వాహనంలో అట్ట పెట్టి అడుగుభాగం ఒక్కసారిగా ఓపెన్ కావడంతో అందులో ఉన్న బాణసంచా కిందపడి పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై దుర్గ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు సహా ఇతర సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై సవివరంగా విచారణ జరిపి, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారు.

అనంతరం గాయపడిన సిబ్బందికి చల్లపల్లిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఎన్నారైఆసుపత్రికి తరలించారు. ఎన్నారై ఆసుపత్రి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న సిబ్బందిని ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్ ఎస్పీ గాయపడిన సిబ్బందిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.

సిబ్బందిని మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య పర్యవేక్షణకై డిఎంహెచ్వో యుగంధర్ ని ఆస్పత్రికి పంపించినట్లుగా తెలిపారు.

సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి, “మీకు అండగా మేమున్నాం, దిగులు పడవద్దు. మెరుగైన వైద్యం అందించడం పోలీస్ శాఖ బాధ్యత” అని భరోసా ఇచ్చారు.అలాగే వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి గాయాల తీవ్రత, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు సహకారం అందించడానికి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన ప్రమాదకర పదార్థాల నిల్వ, తరలింపు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...