Skip to main content

పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 30 విచారణ కేసులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి డివిజన్ వారీగా క్రిమినల్ కేసుల స్థితిగతులను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక సెషన్స్ కోర్టులో మొత్తం 397 క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఇప్పటివరకు 104 కేసులు పరిష్కారం అయ్యాయని, ఇంకనూ 293 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 

పెండింగ్ లో ఉన్న 293 కేసులు 2015 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఉన్నాయన్నారు. అందులో విచారణ క్రింద 30 కేసులు, పెండింగ్ ట్రయల్ లో 220 కేసులు ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు అన్నిటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులందరూ ప్రత్యేక చొరవతో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లాలో 47 కేసులకు సంబంధించి 58 మంది బాధితులకు 1,04,83,750 రూపాయలను నష్టపరిహారం కింద మంజూరు చేయగా అందులో 31 మంది బాధితులకుకి బడ్జెట్ ఉన్నంత మేరకు 66,22,982 రూపాయలు చెల్లించడం జరిగిందని ఇంకనూ 27 మంది బాధితులకు దాదాపు 40 లక్షల రూపాయలు అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందన్నారు.

ఎస్సీ ఎస్టీలకు ఎవరికైనా జీవనోపాదుల కోసం బ్యాంకు రుణాలు అవసరమైతే పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, గన్నవరం, అవనిగడ్డ డిఎస్పీలు శ్రీనివాసరావు లు, డిఐసి జీఎం వెంకటరావు, ఏపిపీ వెంకన్న బాబు, కమిటీ సభ్యులు పరుచూరి వెంకటేశ్వరరావు,మహమ్మద్ బాజీ, రామదేను వేణు, గుమ్మడి విద్యాసాగర్, కొండా నాగేశ్వరరావు, నరేష్ కుమార్, విజయబాబు, ఏఎస్ డబ్ల్యూ ఓ లు మల్లేశ్వరి, రాంబాబు, మోహన్ రావు, పర్వీన్ సుల్తానా తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...