Skip to main content

ఆత్మవిశ్వాసం సడలిన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోంది - అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు

 

మచిలీపట్నం :

     అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ  వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల విద్యాసంస్థలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు స్థానిక మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్ నందు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్  వి.వి. నాయుడు  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ , నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
     విద్యార్థులకు వారి యొక్క ఆత్మ రక్షణ, భద్రత, ప్రమాదం సంభవించే సమయంలో తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, పట్టుదల ఏకాగ్రత తో ఎలా ముందుకు సాగాలి, వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరి ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించి చిన్నచిన్న టెక్నిక్స్ తో తమను తాము ఏ విధంగా రక్షించుకోవచ్చు తెలియజేశారు.
      ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ  ఆత్మరక్షణ అనేది కేవలం మన శరీరానికి సంబంధించిన అంశమే కాదని మానసికంగా మనలో దృఢత్వాన్ని పెంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వ్యవహరించడం, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే తక్షణమే పోలీసు, కుటుంబ సభ్యులు, బంధువుల కు సమాచారం అందించడం వంటివి చేయాలని అన్నారు.
     బాలికలు ఎంత దృఢంగా ఉంటే తమను తాము అంత ధైర్యంగా రక్షించుకోగలరని, ఆపద సంభవించే సమయంలో ఎవరో రక్షిస్తారని వేచి ఉండే కన్నా ముందుగానే తమను తామే రక్షించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు. చదువు మాత్రమే కాకుండా శారీరకృఢత్వాన్ని పెంపొందించుకొని సెల్ఫ్ డిఫెన్స్ పై పూర్తి పట్టు సాధిస్తే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా సునాయాసంగా తప్పించుకోగలరని తెలిపారు. 

మరీ ముఖ్యంగా నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలే అధికం. ముఖ పరిచయం లేని వ్యక్తుల వలన ప్రమాదాలు ఏ రూపంలోనైనా రావచ్చని కనుక ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని చెడు ఆకర్షణలకు లోనవ్వకుండా, ప్రతి ఒక్క విద్యార్థిని వారి యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకొని బలహీనతలను అధిగమించి, వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను తెలుసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని తెలిపారు.

అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ  ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ లలో నిష్ణాతులైన వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించి, ఆకస్మాత్తుగా ఎవరైనా దాడి చేసిన తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి తెలియజేశారు. ఈ ఒక్క రోజే కాకుండా నిరంతరం సెల్ఫ్ డిఫెన్స్ ను అలవాటుగా మార్చుకొని సంపూర్ణ మహిళగా మారాలని పోలీసు అధికారులు తెలిపారు.
https://youtube.com/shorts/iGB6YIIdZ9k?si=kFAHh4xpgRnGChdJ

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...