Skip to main content

బాల్యవివాహాలు, బాలలపై లైంగిక వేధింపుల నివారణకు గ్రామ స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలి –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం: 

జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాలలపై లైంగిక వేధింపుల నివారణకు గ్రామ/వార్డు స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గ్రామ/వార్డు స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ/వార్డు స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీలో గ్రామ సర్పంచ్ చైర్‌పర్సన్‌గా, మహిళా పోలీస్ మెంబర్ కన్వీనర్‌గా, పంచాయతీ/వార్డు సెక్రటరీ, వీఆర్వో, స్థానిక ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎమ్, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ఈ కమిటీలు ప్రధానంగా జిల్లాలో బాలల సంక్షేమం, సంరక్షణ, బాల్యవివాహాల నివారణ, పిల్లలపై లైంగిక వేధింపుల అరికట్టడంలో మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఈ విషయంలో మహిళా పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

జిల్లాలో కొన్నిచోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది సమన్వయ లోపం కారణంగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకముందు ఒక్క బాల్యవివాహం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అలాగే జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు కూడా నమోదవుతున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన పరిణామం కాదని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, విద్యాభ్యాసం మధ్యలో నిలిచిపోవడం వంటి ప్రతికూల ఫలితాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్నామని, అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా పిల్లల సంరక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలపై కూడా చైతన్యం అనే కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాలల్లో ర్యాగింగ్ నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డులో బాలల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం సంబంధిత కమిటీలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, జెడ్పి సీఈవో కే కన్నమనాయుడు, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, విద్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయాల మహిళా పోలీసులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...