Skip to main content

కావూరి సాంబశివరావు కి నివాళులు అర్పించిన మచిలీపట్నం కౌన్సిల్

మచిలీపట్నం:
      సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి,  కావూరి సాంబశివరావుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. 
       కావూరి 1984, 89, 98, లలో మూడుసార్లు మచిలీపట్నం నియోజకవర్గం  నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని, తదుపరి ఏలూరు నుండి రెండు విడతలుగా ఎంపీగా సేవలందించి, కేంద్ర మంత్రిగా పనిచేశారని పలువురు కౌన్సిల్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజా సేవలో తరించారని కొనియాడారు.
       తొలుత మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎంపీ అంటే కేవలం ముఖ్యమైన నాయకులకు మాత్రమే అందుబాటులో ఉండడం కాకుండా గ్రామ గ్రామాన ప్రజలను స్వయంగా కలిసి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారన్నారు. మొట్ట మొదటిగా ఈ సాంప్రదాయం ఆయనతోనే ప్రారంభమైందన్నారు. 40 సంవత్సరాల క్రితం టీవీ అనేది కేవలం డబ్బున్న వారి ఇంటికే పరిమితమైన రోజుల్లో, మారుమూల పల్లెటూళ్లలో పంచాయతీ ఆఫీసుల్లో, దేవాలయాల్లో, ప్రజలు అందరూ కూర్చుని టీవీ ద్వారా వీక్షిస్తూ రాష్ట్రంలో జరిగే అన్ని పరిణామాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజా సేవకులు కావూరి సాంబశివరావు అని కొనియాడారు.
          కార్పొరేటర్ సుబ్బన్న మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అనే పథకం ద్వారా టైలరింగ్, హెవీ డ్రైవింగ్, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, డిజిటల్ మెకానిక్ కోర్సులు ఉచితంగా ట్రైనింగ్ క్లాస్ లు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత కావూరికే దక్కుతుందన్నారు. 
           కావూరి అందించిన సేవలను పలువురు కార్పొరేటర్లు కొనియాడారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు యావన్మంది కావూరు సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తదుపరి 10 నిమిషాలు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...