Skip to main content

పన్నులు సకాలంలో చెల్లించి మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలి: జిల్లా కలెక్టర్


మచిలీపట్నం:
     
       పన్నులు సకాలంలో చెల్లించి మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
      గురువారం మధ్యాహ్నం నగరంలోని మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ ప్రత్యేక పరిపాలన అధికారిగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, రెవిన్యూ అధికారి వెంకటేశ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించిన పన్నులను అన్నిటినీ చెల్లించి నగరపాల సంస్థకు సహకరించాలన్నారు. ఆ విధంగా చెల్లించిన పన్నులతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు వీలవుతుందన్నారు.
       పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కోరారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందజేయాలన్నారు.
      ప్రభుత్వం ప్రకటించిన ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అనధికార లేఔట్లలో స్థలం కొనుగోలు చేసి ఉంటే వాటిని నగరపాలక సంస్థలో క్రమబద్ధీకరణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ విధంగా చేయడం వలన వారికి భవిష్యత్తులో బ్యాంకు రుణాలు సజావుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. 
       అనంతరం జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రత, పన్నుల వసూళ్లు తదితర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.
       ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, పలువురు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...