Skip to main content

కృష్ణాజిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు



 ఎంవిఐ లోకనాథ్ నివాసం, కార్యాలయం లో కీలక పత్రాలు స్వాధీనం
​మచిలీపట్నం :

       అవినీతికి నిలయంగా మారిన కృష్ణా జిల్లా రవాణా శాఖపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన గుంటూరు ఏసీబీ పరిశీలకులు అంబటి మన్మధరావు బృందం, మచిలీపట్నం మోటారు వాహనాల తనిఖీ అధికారి ( ఎం వి ఐ) పి. లోకనాథ ప్రసాద్ అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై మంగళవారం ఉదయం నుండే విజయవాడలోని ఆయన నివాసం, బందరులోని కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించి కలకలం సృష్టించారు. ​ ​
        చాలా కాలంగా మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. ముఖ్యంగా లైసెన్సుల జారీ, వాహనాల ఫిట్‌నెస్, ఆకస్మిక తనిఖీల పేరుతో వాహనదారుల నుండి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టీవో శ్రీనివాసు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్ నాయక్, సోనీ ప్రియా, నారాయణస్వామిల పనితీరుపై కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రధానంగా లోకనాథ ప్రసాద్‌పై వచ్చిన పక్కా ఫిర్యాదులతో అధికారులు గురిపెట్టారు.
​విజయవాడలో నివాసం.. బందరులో వసూళ్లు!
         ​విజయవాడలో నివాసం ఉంటూ ప్రతిరోజూ బందరు డ్యూటీకి వచ్చే లోకనాథ్, తన ఉద్యోగంను అడ్డం పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణ లో తేలింది. ఆయన సంపాదనకు, ఆస్తులకు పొంతన లేకపోవడంతో నివాసంలో కార్యాలయంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో మిగిలిన సిబ్బంది హడలెత్తిపోయారు.
​రికార్డుల జల్లెడ లైసెన్సుల జారీలో జరిగిన అవకతవకలు, ఏజెంట్ల ప్రమేయంపై అధికారులు ఆరా తీశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి అక్రమాలకు పాల్పడే ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేశాయి.
​        ఈ సందర్భంగా ఏసీబీ అధికారి అంబటి మన్మధరావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా డి టి వో ఆఫీస్ లో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోక్ నాథ్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఆరోపణలు రావడంతో లోక్నాథం పై కేసు నమోదు చేసి ఏకకాలంగా విజయవాడలో నివాసం ఉంటున్న ఇంట్లోనూ వాళ్ల బంధువుల నివాసంలోనూ ఆఫీసులో తనిఖీ చేయడం జరిగిందన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...