మచిలీపట్నం:
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెడన మండలంలోని పెనుమల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఒకవైపు ఇంటింటికి తిరిగి 9 వ తరగతి చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను ఆరా తీశారు. మరోవైపు స్వామిత్వ సర్వే వివరాలను పరిశీలించారు.
తొలుత జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి 9 వ తరగతి చదువుతూ 10వ తరగతికి వెళుతున్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉన్నత పాఠశాలలో ప్రత్యేకించి ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్సు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో విచారించారు.
తదుపరి కలెక్టర్ గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని కాగిత లాస్యను ఎలా చదువుకుంటున్నావని, ఏమవుతావని ప్రశ్నించగా తాను బాగా చదువుకుంటున్నానని, డాక్టర్ అవుతానాని కలెక్టర్ కు చెప్పారు. ఆహారం బాగా తినాలని పాఠశాలలో చిక్కి కోడిగుడ్డు ఇస్తున్నారా తింటున్నావా, రాగిజావ తాగుతున్నావా అని ప్రశ్నించగా ఆ అమ్మాయి అన్నిటికీ అవునని చాలా స్మార్ట్ గా సమాధానాలు చెప్పడంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి పిల్లలు ఏ కారణం చేతనైనా చదువు మధ్యలో ఆపివేస్తే వారు జీవితాంతం వెనకబడిపోయి బాధపడతారన్నారు.
ఇటువంటి వారికి బాగా చదివించాలనీ, కనీస స్థాయి పరిజ్ఞానం తెలుసుకోవాలన్నారు. మూడు నాలుగు నెలల తర్వాత మరల వస్తానని అప్పుడు అన్ని చదివి వినిపించాలని కలెక్టర్ విద్యార్థినికి తెలిపారు.
గ్రామంలో గుర్తించిన నిర్మాణ వాలంటీర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతూ ఉంటారని ఒక్కసారి అర్థం కాక వెనుకబడితే అలాగే జీవితాంతం వెనుకబడిపోతారన్నారు. అటువంటి వారికి ధైర్యం చెప్పి సరైన విధంగా ప్రోత్సహిస్తే చదువులో ముందుకు సాగుతారన్నారు. చాలామంది విద్యార్థులు పరీక్షలు దగ్గర పడినప్పుడు చదువుతుంటారని అలా కాకుండా ముందు నుంచే చదువుకుంటే ధైర్యంగా బాగా పరీక్షలు రాయవచ్చన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పెనుమల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి స్వమిత్వా రికార్డులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రోవర్సు పాయింటు సరిగా ఉందో లేదో కూడా పరిశీలించారు. రెండుమూడు వీధులు తిరిగి ఇళ్ల కొలతలు సరిగా ఉన్నాయా లేదా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ పంచాయతీ పన్నులు, పన్నేతర లావాదేవీలు నగదు రహితంగా చెల్లింపు ఏ విధంగా చేస్తున్నారో గమనించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రాకుండానే స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఆన్లైన్ ద్వారా పన్నులన్నీ ఇంటి వద్ద నుంచే చెల్లించే అవకాశం ఉందన్నారు. అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో సమిత్వా సర్వే జరుగుతుందని, సర్వే ద్వారా గ్రామ కంఠంలో ఉన్న ఇంటింటికి తిరిగి ఆస్తి హక్కు కార్డులు ఇచ్చారా లేదా సర్వే సరిగా చేశారా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పర్యటిస్తున్నామన్నారు.
పెనుమల్లి గ్రామపంచాయతీలో నూటికి నూరు శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినందుకు సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్వే భూ రికార్డుల ఏడి లక్ష్మణ్ బాబు, డి ఎల్ డి ఓ పద్మ, డి ఎల్ పి ఓ రజావుల్లా, తహసిల్దారు అనిల్ కుమార్, ఎంఈఓ లు హరినాథ్, సలోమి, సర్పంచ్ రామానాయుడు, జడ్పిటిసి ఆర్జా వెంకట నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment