Skip to main content

పెన్షనర్లను విభజించి పాలించడం అన్యాయం

జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన పెన్షనర్లు 

మచిలీపట్నం : 

     2025 మార్చి 25న ప్రవేశపెట్టిన ఆర్థిక సవరణ బిల్లులో భాగంగా పెన్షనర్స్ సవరణలు చేర్చి పార్లమెంట్లో ఆమోదించడం జరిగిందని, ఒకసారి బిల్లు పాస్ అయి రాష్ట్రపతి ఆమోద ముద్రపడితే అది చట్టంగా అవుతుందని, మార్చి 29 న గెజిట్ పబ్లికేషన్ చేసి జీవో గా ఇవ్వడం కూడా జరిగిందని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక కలెక్టరేట్ వద్ద పెన్షనర్స్ 9వ పిఆర్సి కమిషన్ రికమండేషన్లు అమలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం వారి చేతుల్లోకి తీసుకుంటూ దేశంలోని 70 లక్షల మంది పెన్షనర్ హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ ధోరణిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనదేశంలో ఓపిఎస్ పెన్షన్స్ పొందుతున్న, పొందబోయే వారందరికీ 25 మార్చి 1వ తేదీ దుర్దినం అని, ఆ బ్లాక్ డే రోజు పార్లమెంటులో వాలిడేషన్ యాక్ట్ ఆమోదించిన రోజుగా చీకటి దినంగా పరిగణించామని అన్నారు. ఆ చట్ట ప్రకారం ఒకటి ఒకటి 2026 ని పరిధిలోకి తీసుకొని పెన్షనర్లను విడదీసి రాబోయే జనవరి 2026 నుండి 9వ పిఆర్సి కమిషన్ రికమండేషన్లు అమలు చేయడమనేది వారి చేతుల్లోకి తీసుకుంటూ దేశంలోని 70 లక్షల మంది పెంచిన హక్కులను కాలరాసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లు అందరూ పే రివిజన్ సౌకర్యాన్ని పొందాలని భవిష్యత్తులో ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ సౌకర్యాలు పిఆర్సి సౌకర్యాలు అందరికీ పునరుద్ధరించేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెన్షనర్స్ హక్కులను కాలరాయడానికి నిరసనగా పెన్షనర్స్ సామూహిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చిందని, ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ వారి ఇచ్చిన పిలుపుమేరకు నేడు కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ యాక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను వర్గీకరించే అధికారం పొందిందని ప్రస్తుతం ఓ పి ఎస్ పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ జనవరి 2026 నుండి అమలు చేయబోతున్న ఎనిమిదవ సిపిసి నందు కమిషన్ ఇచ్చే రికమండేషన్ కు అనర్హులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓపిఎస్ పెన్షనర్లు అందరికీ పిఆర్సి ప్రయోజనాలు అందేలా చూడాలని, విభజించి పాలించడం, న్యాయం కాదని పే రివిజన్ సదుపాయం కోల్పోకుండా అందరికీ కల్పించాలని భవిష్యత్తులో ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ పెరుగుదల ఉండకపోవడం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు నేడు కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నట్లుగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిహెచ్ ఆశీర్వాదం వి ఆదినారాయణ వి కృష్ణారావు భాస్కరరావు పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...