Skip to main content

కూచిపూడిని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక

మచిలీపట్నం :

      ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడిని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తామని అమరజీవి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడు పేర్కొన్నారు.

        శనివారం మధ్యాహ్నం ఉపకులపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో నగరంలోని వారి చాంబర్లో కూచిపూడి అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 

        ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలకు సమ్మతి తెలుపుతూ అన్ని విధాల సౌకర్యాలు కల్పించి కూచిపూడి నాట్యకళా పీఠాన్ని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చి దిద్దుతామన్నారు. వేసవికాలంలో కోర్సులను 15 రోజులు, 21 రోజులు, మూడు నెలల కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్లైన్ కోర్సులను కూడా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
ఆడిటోరియం నిర్మించి అందులో కనీసం 50 గదులను ఏర్పాటు చేసి వసతి కల్పిస్తామన్నారు. త్వరలో అంతర్జాతీయ ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

         జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠం లో వృత్తిపరంగానే కాకుండా కొంతమంది అభిరుచిగా కూడా నేర్చుకునేందుకు వస్తున్నారన్నారు. అయితే అక్కడ రెగ్యులర్ కోర్సులే కాకుండా 15 రోజులు, నెల, రెండు నెలలు కోర్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆ విధంగా చేయడం వలన ఎంతోమంది ప్రముఖులకు కూడా కూచిపూడి నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు.

           అంతేకాకుండా అక్కడ ఒక ఆడిటోరియం నిర్మించి వసతి కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ఒక వాస్తు శిల్పిని గుర్తించి వారి ద్వారా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల నుండి సిఎస్సార్ నిధులు, దాతల నుండి ఫౌండేషన్ లను సంప్రదించి కావాల్సినన్ని నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.

          కూచిపూడి గ్రామంలో రాష్ట్రీయ గ్రామీ స్వరాజ్ అభియాన్( ఆర్ జి ఎస్ ఏ) కింద 50 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారులు నిర్మించడం జరుగుతుందని, త్వరలో పూర్తికానున్నాయన్నారు.. 
కూచిపూడి నేర్చుకున్న ప్రముఖుల జాబితాను కూడా సేకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి ఏ ఏ పథకాలు జిల్లాకు పనికి వస్తాయో వాటి వివరాలు సేకరించాలన్నారు. పి...ఫోర్ లో భాగంగా 12 కుట్టుమిషన్లను మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. గ్రామంలో మురుగునీటి వ్యవస్థ మెరుగుపరిచేందుకు 22 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలను సిఆర్డిఏ కి పంపామని వారి నుండి నిధులు రాగానే పనులు మొదలు పెడతామన్నారు

        ఈ సమావేశంలో కలెక్టర్ ఛాంబర్ నుండి జడ్పీసీఈఓ కే.కన్నమ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, భూగర్భ జల శాఖ అధికారి బిందు శ్రీ,, కూచిపూడి తహసిల్దారు మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, కూచిపూడి నాట్య కళాకారులు వెంపటి సత్య ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అంకబాబు, స్థానిక నాయకులు అమరబలేశ్వరరావు, ఆన్లైన్లో ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, టూరిజం కన్సల్టెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...