Skip to main content

హత్యను ప్రమాదముగా చిత్రీకరణ - హత్యగా నిర్ధారించిన పోలీసులు... నిందితుడు అరెస్ట్

మచిలీపట్నం :

        కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మచిలీపట్నం సబ్ డివిజన్ పోలీసు అధికారి పర్యవేక్షణలో, ఇనగుదురు పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసును ప్రాధమికముగా అనుమానాస్పద మరణంగా నమోదు చేసి దర్యాప్తులో లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

         దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఆధారంగా కేసు యొక్క పూర్వపరాలను విలేకరులకు వివరించిన ఇనుకుదురు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్. మృతుడు అల్లాడ సుబ్బారావు (77 సంవత్సరాలు) వద్ద ముద్దాయి గుడిసేన వెంకయ్య అలియాస్ వెంకన్న, చిలకలపూడి, మృతుని వద్ద కార్మికునిగా పని చేస్తున్నాడు. మృతుడు, నిందితుడి మధ్య ఆర్థిక విషయాలపై వివాదాలు ఉండడం, తరచూ అసభ్య పదజాలంతో తిడుతూ ఉండటం వలన ద్వేషము పెంచుకుని గత 20 జులై 2025 మధ్యాహ్నం సమయములో నిందితుడు చెక్క కమ్మితో మృతుడి తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. 

          అనంతరం సంఘటనను ప్రమాదవశాత్తు జరిగినట్లు చూపించేందుకు చెక్క తలుపులు పడిపోయినట్లుగా నాటకం సృష్టించాడు. నేరానికి సంబందించిన ఆధారాలను నాశనం చేయుటకు దిండు, బెడ్ షీట్ ని పడేసాడు . సాంకేతిక ఆధారాలైన సీసీటీవీ పుటిజ్ విశ్లేషణ, అనుమానితుడిపై విస్తృత విచారణ, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్, నేరానికి వాడిన వస్తువుని స్వాధీనం చేయుట ద్వారా ముద్దాయి నేరం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు పరుస్తామని మెరుగైన విచారణ నిమిత్తం ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని పోలీసులు తెలిపారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...