Skip to main content

"స్వర్గపురి " లో పార్థివ దేహ విశ్రమాలయ ప్రారంభం

మరణానంతరం కూడా సౌకర్యాల కల్పన అభినందనీయం

కాటం వెంకట్రావు రీజినల్ హెడ్, యూనియన్ బ్యాంక్

మచిలీపట్నం :

మనిషి మరణానంతరం కూడా సకల సౌకర్యాలతో పార్దివ దేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించుకొందుకు వీలుగా, నిర్వాహకులు "స్వర్గపురి" లో ఏర్పాట్లు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కాటం వెంకట్రావు అన్నారు. 

మూడు స్తంభాల సెంటర్ సమీపంలో శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు గురువారం పార్థివ దేహ విశ్రమాలయప్రారంభోత్సవాన్ని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కాటం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ స్వర్గపురి నిర్మిత పార్థివ దేహ విశ్రమాలయం 
సమాజమునకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బయటి ఊరి నుండి వచ్చి వెంటనే మరణానంతర విధులు, కార్యక్రమాలు నిర్వహించ లేని వారు, అద్దె గృహాలలో నివసించు వారికి, ఇతర దేశములలో నివసించు పిల్లల రాక కోసం వేచి చూడ వలసిన వారికి, పార్థివ దేహ విశ్రమాలయం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నగరంలో ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాతలను అభినందిస్తూ తమ యూనియన్ బ్యాంకు నుండి విశ్రమాలయానికి ఏసీ నిమిత్తం 75 వేల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మరణానంతర విధులు కూడా నిర్వహించుటకు కావలసిన సౌకర్యాలు, సదుపాయములతో, కుల మత రహితముగా జరుపు కొనుటకు, ఏర్పాట్లు కలిగి ఉండడం అభినందనీయమన్నారు. నూతన నిర్మిత నిర్మాణమును తన చేతుల మీదుగా నిర్వహించడం తాను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం అన్నారు. దాతల దాతృత్వంతో ఈ స్వర్గపురిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమములో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ రీజియనల్ హెడ్ ఉమా రామ లింగా రెడ్డి, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ రామ్ చరణ్ తేజ, గది నిర్మాణ సహకారం అందించిన దాతలు, గుడివాడ సోమేశ్వర రావు, శిర్విసెట్టి భాస్కర్ లు, ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు దోరడ్ల హేమ ప్రకాష్, కార్యదర్శి గుడివాడ మెహెర్ ప్రసాద్, కోశాధికారి ఉడత్తు దుర్గా ప్రసాదరావు, , ఉప కార్యదర్శి వాకమల్లు శ్రీనివాస రావు,కమిటీ సభ్యులు అన్నం రామకృష్ణ బాబు రావు, కొప్పర్తి రవి శంకర్, పాలకుర్తి శరత్ కుమార్ తదితరులు గౌరవ ఆహ్వానితులు రాళ్ళబండి రాజారం, కేఆర్ కేఎం మాస్టారు, లంక గంగాధర్, గుడివాడ రవికుమార్, ఉదయగిరి సతీష్, పాలకుర్తి గిరి, తమ్మన నారాయణ రావు, ఊర రామాంజనేయులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...