Skip to main content

పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా జగన్ తెలుసుకోవాలి

- నేడు వాడుతున్న రోడ్లన్నీ పీపీపీ విధానంలో చేసినవే
- మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ 
- అభివృద్ధిని అడ్డుకుంటామంటే సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్.

మచిలీపట్నం :

జనం గడ్డి పెట్టినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురి సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా నడచుకుంటే జగన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టడం తధ్యమన్నారు. మెడికల్ కాలేజీల అభివృద్ధిపై వైసీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు పీపీపీ పద్దతిలో రోడ్లను అభివృద్ధి చేయడం వల్లనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సదుపాయం పెరిగింది. పరిశ్రమలు వచ్చాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. నాడు తీసుకున్న సంస్కరణల కారణంగానే ఇంత స్థాయిలో అభివృద్ధి జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు అభివృద్ధిని కొనసాగించారు. కానీ నేడు జగన్ రెడ్డి వైఖరే విధ్వంసం. అధికారంలోకి వస్తే.. పీపీపీ పద్దతిలోక ఆస్పత్రుల అభివృద్ధికి ముందుకొచ్చిన కంపెనీల్ని తరుముతానని బెదిరించడం దుర్మార్గం. జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదు. 

కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ.. పీపీపీ విధానాన్ని సమర్ధించింది. పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేసినప్పటికీ.. అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. ఆస్పత్రిని నిర్మించి, నిర్వహించే బాధ్యతలు ప్రైవేటుకు ఇస్తుంటే ఎందుకింత ఏడుపు.? మెడికల్ కాలేజీలను వీలైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో విద్యార్ధులకు సీట్లు పెరుగుతాయి. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇంత మేలు జరుగుతున్నందున వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దొంగ సంతకాలు పెట్టి గవర్నర్ గారికి లేఖలిచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే ప్రైవేటుపరం ఎందుకు అవుతుందో జగన్ రెడ్డి బుర్ర పెట్టి ఆలోచించాలి. గత ఐదు సంవత్సరాలు బెదిరింపు ధోరణి కారణంగానే పెట్టుబడులు తరిమేసి, పారిశ్రామిక వేత్తల్ని తరిమేసి అవస్థలపాలు చేశారు. కానీ నేడు చంద్రబాబునాయుడి దూర దృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన కార్యదక్షతకు నిదర్శనంగానే ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...