Skip to main content

మార్కెటింగ్ సొసైటీ లావాదేవీలను పరిశీలించిన బండి రామకృష్ణ.

మచిలీపట్నం :

కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ విజయవాడలోని కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. డీసీఎంఎస్ పరిధిలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు రైతులకు చౌక ధర దుకాణాల ద్వారా అందిస్తున్న ఎరువుల వివరాలను, డిసిఎంఎస్ పరిధిలో ఉన్న భూములను, గిడ్డంగులను, మూల నిధులు రావలసిన నిధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సొసైటీ ద్వారా జరిగిన వ్యాపార లావాదేవీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

      డీసీఎంఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాల ఆక్రమణలను తొలగించి స్వాధీన పరుచుకుని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని అనుమతులు రాగానే ఖాళీ స్థలాలను గోడౌన్లుగా,కళ్యాణ మండపాలుగా తీర్చిదిద్ది డిసిఎంఎస్ ఆదాయ వనరులు పెంచుతామన్నారు. రైతు శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అన్నదాతకు మేలు చేసే విధంగా కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ మార్కెట్ సొసైటీ కృషి చేస్తుందని అన్నారు.

       జనరిక్ ఔషధ దుకాణాలనుఏర్పాటుచేసి ప్రజలకు తక్కువ ధరకు మందుల విక్రయాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులకు ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అవగాహన కల్పించి ఆ పంటలను ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి కేంద్రీకరించి వాటిని మన నేలలో పండించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. అందరూ ఒకే రకమైన పంటలను పండించడం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవలసిన పరిస్థితి వస్తుందని దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించి తద్వారా రైతుకు లాభదాయకమైన పంటలను పండించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

     ఈ కార్యక్రమంలో  బిజినెస్ మేనేజర్ యు.వి.ప్రసాద్ రావు,  మేనేజర్ ఆర్.రమేశ్ బాబు (ఓ ఎస్ డి), వి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...