Skip to main content

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

 మచిలీపట్నం :

 వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం మచిలీపట్నంలోని వివిధ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
 బచ్చుపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కలగజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ముక్తేవి శశికాంత్ స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, పదవ కోర్టు ఏ డీజే బాబు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని దర్శనం చేసుకొని పూజల్లో పాల్గొన్నారు.
 మచిలీపట్నం మెయిన్ రోడ్ ఏం చేస్తున్న భద్రాద్రి రామాలయ దేవస్థానం నందు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాన అధికారి వై శిరీష,కే శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చకులు గరిమెళ్ళ రామానుజ శ్రీకారచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 మచిలీపట్నం మెయిన్ రోడ్ లోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన కోలాట ప్రదర్శనలో భక్తులు కోలాటాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి గొర్రెపాటి. గోపీచంద్, మోటమర్రి. వెంకట బాబా ప్రసాద్, లోగిశెట్టి.వెంకటస్వామి మరియు వందలాదిమంది భక్తులు విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని కార్య నిర్వహణ అధికారి మాగపాటి సత్యప్రసాద్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...