Skip to main content

మైనర్లు వాహనాలను నడపరాదు


నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు తప్పవు.... ట్రాఫిక్ సీఐ నున్న రాజు. 

మచిలీపట్నం : 

     నగరంలో ఇటీవల కాలంలో మైనర్ బాలురు, బాలికలు యదేచ్ఛగా ద్విచక్ర వాహనాలను అత్యంత వేగంగా నడుపుతున్నారు. జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మైనర్లను వాహనాలు నడపవద్దని నడుపుతున్న వాహనదారులను ప్రధమ తప్పుగా మందలించి సీఐ నున్న రాజు పర్యవేక్షణలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 

      మైనర్లు ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా పట్టుకుంటున్న పోలీసులు వారి అడ్రస్సులు తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇకనుంచి మీ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని ఈసారి కనుక పట్టుబడితే జరిమానా విధించి లైసెన్సు రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

       మైనర్లను పట్టుకున్నప్పుడు మైనార్టీ తీరిన తర్వాతనే తాము డ్రైవింగ్ చేస్తామని వారితో సీఐ రాజు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని యువకులు అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నందున ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. మైనర్లతో పాటు యువకులు కూడా వాహనాలను ఫ్యాషన్ కోసం జోరుగా పలువురు దృష్టిని ఆకర్షించడానికి నడుపుతున్నారని అన్నారు.

        వాహనాలను నడిపే వారు వేగంగా వెళితే ప్రమాదాలు జరిగితే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే 5000 రూపాయలు ఫైన్ విధిస్తున్నామన్నారు. అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ రాంగ్ రూట్లో వెళ్తున్న, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న 2000 రూపాయలు ఫైన్ కట్టిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. 

      పాఠశాలలో, కాలేజీలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. మైనర్ బాలురు, బాలికలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ నున్న రాజు తెలిపారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...