Skip to main content

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం:

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 

శుక్రవారం జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన నాగాయలంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లలకు ఉపాధ్యాయులు ఏ విధంగా చదువు చెబుతున్నారుఅని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎలాగా ఉందని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భోజనం బాగుందంటూ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, చదువు బాగా చెబుతున్నారని, విజ్ఞాన యాత్రలు కూడా నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు వివరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్స్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో తెలుసుకోగలుగు తున్నారన్నారు. 
       
ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని సంకల్పించిందన్నారు. జిల్లాలో 300 మంది స్ఫూర్తి ఉన్న వ్యాపారవేత్తలను గుర్తించామన్నారు. అందులో ఇప్పటికే 90 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. 
       
అవనిగడ్డ నాగాయలంక మండలాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా యూనిట్లను పరిశీలించామని వారు వ్యాపారాన్ని బాగా విస్తరించుకున్నారన్నారు. ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.

విజన్ ఆంధ్ర 2047 లో భాగంగా పెరటి తోటల పెంపకానికి కూడా ప్రోత్సాహాలను అందిస్తున్నామని, రసాయన ఎరువులు లేకుండా ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్న తోటలను కూడా పరిశీలించామన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా సామాగ్రిని, శరీర భాగాలను వివరించే ప్రయోగశాల పరికరాలను, మైక్రోస్కోప్ ను, వ్యర్థాలతో కళాకృతులను పరిశీలించారు. 

చాలామంది విద్యార్థులకు భవిష్యత్తులో కేవలం డాక్టర్ ఇంజనీరు లేదా ఉపాధ్యాయుడు కావాలని అనుకుంటుంటారని అలా కాకుండా ఇతరత్రా రంగాలలో కూడా రాణించవచ్చని విశదీకరిస్తూ విద్యార్థులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వృత్తి విద్య శిక్షకులు సాయి కుమార్, తులసిలకు సూచించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మత్స్యకారుల సొసైటీ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తహసిల్దారు ఆంజనేయ ప్రసాదు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లీలా మారుతి, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ తలసిల స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...