మచిలీపట్నం:
మార్గశిర శుద్ద త్రయోదశి హనుమద్ వ్రతం ను బుధవారం మచిలీపట్నం శ్రీ సువర్చల సమేత ఆంజనేయస్వామి వారి దేవస్థానం నందు అత్యంత భక్తి, శ్రద్దలతో 100 మంది దంపతులు ఆచరించారు.. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈవో తికిశెట్టి మోహన్ రావు ఏర్పాట్లు పర్యవేక్షంచారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలపాటి రమేష్, శివ నాగేశ్వరరావు, ఉమాదేవి,సురేష్, భక్తులు పాల్గొన్నారు .
Comments
Post a Comment